టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి తొలిసారి గా స్క్రీన్ షేర్ చేయూసుకోబోతున్న రామ్ చరణ్, ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో చెవిటి వాడైన వ్యక్తిగా నటించి మంచి పేరు సంపాదించాడు. 

 

ఇక మరోవైపు గత ఏడాది పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టిన కెజిఎఫ్ సినిమా హీరో యాష్, ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించాడు. ఇక ప్రస్తుతం యాష్ కెజిఎఫ్ సీక్వెల్ అయిన చాప్టర్ 2 లో హీరోగా నటిస్తున్నాడు. అత్యంత భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా నేడు బిహైండ్ ఉడ్స్ గోల్డ్ మెడల్స్ వారి అవార్డుల కార్యక్రమం చెన్నై లో జరిగింది. ఈ వేడుకలో రామ్ చరణ్ కు కూడా అవార్డు దక్కింది. 

 

అలానే కేజీఎఫ్ స్టార్ యాష్ కూడా ఈ వేడుకకు విచ్చేసారు. కాగా ఒకానొక సమయంలో వీరిద్దరూ కలిసి కొద్దిసేపు దీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఎవరికి వారు రెండు భారీ సినిమాల్లో నటిస్తున్న ఈ ఇద్దరు హీరోలు కూడా, రాబోయే మరికొద్ది రోజుల్లో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారు అంటూ నేటి ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఆ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉందొ తెలియదు కానీ, రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటించే అవకాశం లేకపోలేదని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజలు ఓపికపట్టాల్సిందే....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: