టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న తొలిసారిగా మహేష్ ప్రక్కన జోడి కడుతున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్, ఆడియన్స్ మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎంతో అలరించడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా బాగా పెంచేయడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి రెండవ సాంగ్ గా సూర్యుడివో చంద్రుడివో అనే పల్లవితో సాగె సాంగ్ రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. మంచి మెలోడీ సాంగ్ గా కంపోజ్ చేయబడిన ఈ సాంగ్ కు ఒక ప్రత్యేకత ఉందని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ నేడు ట్వీట్ చేస్తూ చెప్పారు.

 

బాలీవుడ్ లో పలు సూపర్ స్టార్స్ కు ఎన్నో సక్సెస్ఫుల్ సాంగ్స్ ని పాడి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన బి ప్రాక్, ఈ పాటను ఆలపించడం జరిగింది. 
ఇటీవల హిందీలో మంచి విజయం సాధించిన అక్షయ్ కుమార్ మూవీ ఫిల్హాల్ లో కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ పాడిన బి ప్రాక్, ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు లోని సూర్యుడివో చంద్రుడివో సాంగ్ ని ఆలపించడం జరిగింది. వాస్తవానికి గతంలో ప్రాక్ కు పలు సౌత్ సినిమాల్లో పాటలు పాడడానికి ఛాన్స్ వచ్చినప్పటికీ, ఆయనకు అవేవి నచ్చకపోవడంతో పాడలేదని, కాగా ఈ సాంగ్ ప్రాక్ కు ఎంతో నచ్చడంతో పాడడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి రేపు సాయంత్రం రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ ఎంతవరకు శ్రోతలను అలరిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: