బుల్లి తెరపై యాంకర్ గా ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి.. ఇటు సినిమాలలోనూ..అటు యాంకరింగ్ తో మంచి ఫాంలో ఉన్నాడన్న సంగతి తెలిసింద. ఇది ఇలా ఉండగా రవి షోలో ఫేమస్ అవ్వడం కన్న కూడా కాంట్రవర్సీ లతో బాగా ఫేమస్ అవుతూ వస్తున్నాడు.. ఈ మధ్య ఫిమేల్ యాంకర్స్ తో కూడా రొమాన్స్ చేస్తున్నాడు అనే వార్తలు తరుచూ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి..
ప్రస్తుతం రవి ఢీ షో ను పక్కన పెట్టశారు.. పటాస్ షోలో కూడా కనిపించలేదు.. మరి సినిమా చేస్తున్నాడా లేక ఫ్యామిలీతో జాలి ట్రిప్ కివెళ్ళడా అన్న విషయం తెలియాల్సి వుంది..ఇది ఇలా ఉండగా తాజాగా రవి కారుకు యాక్సిడెంట్ అయిందనే వార్తలు వినపడుతన్నాయి.. ప్రమాదవశత్తూ ఈ ప్రమాదం జరిగిందని వార్తలు వినపడతున్నాయి..
అసలు వివరాల్లోకి వెళితే.. యాంకర్ రవి ప్రయాణిస్తున్న ఎందుకో తెలియదు కానీ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు యాంకర్ రవి. ఇప్పుడు మరోసారి ఈయన వార్తల్లోకి వచ్చాడు. తాజాగా ఈయన కార్కు యాక్సిడెంట్ అయింది. తన యూ ట్యూబ్ ఛానెల్లో వీడియోను కూడా పోస్ట్ చేసాడు ఈ యాంకర్. మూసాపేట్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న సమయంలో రవి కారుకు ప్రమాదం జరిగింది. ఓ డిసిఎం వ్యాన్ వచ్చి తన కార్ను ఢీ కొట్టిందని.. ఈ ప్రమాదంలో తనకేం కాలేదు కానీ కార్ మాత్రం డ్యామేజ్ అయిందని చెప్పుకొచ్చాడు ఈయన. తన లైన్లోనే తాను ఉన్నా కూడా రాంగ్ రూట్లో వచ్చి.. నేరుగా కార్కు డ్యాష్ ఇచ్చాడని చెప్పాడు యాంకర్ రవి. ఆ సమయంలో వెళ్లి డిసిఎం వ్యాన్ డ్రైవర్ను అడిగితే ఆ సమయంలో అతడు దారుణంగా తాగి ఉన్నాడని చెప్పాడు రవి.
అంత దారుణంగా తాగి ఉన్న డ్రైవర్ బండి నడిపితే రోడ్డు మీద ప్రాణాలు పోవా అంటూ ప్రశ్నిస్తున్నాడు రవి. కారుకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆయన డ్రైవర్ కార్లోనే ఉన్నాడు. పైగా తనకు పెళ్లాం పిల్లలున్నారు వదిలేయండి సర్ అంటూ తనను అడిగాడని చెప్తున్నాడు రవి. ఆ తర్వాత వాళ్లు డిసిఎం అక్కడే వదిలేసి పారిపోయారని చెప్పాడు ఈ యాంకర్. తన డ్రైవర్ ఆ డిసిఎం డ్రైవర్, క్లీనర్ను పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నట్లు చెప్పాడు రవి. ఇంత దారుణంగా తాగి డ్రైవ్ చేయడం వల్లే రోడ్డు మీద ఇలాంటి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని రవి అన్నారు. అనంతరం సనత్ నగర్ పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేశాడు..