వరుస విజయాలతో దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్ ఇపుడు మరో మెహరీన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సినిమా తెరకెక్కుతుంది.. 

 

ఈ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ ఎప్పటిలాగే ఫ్యామిలీ అబ్బాయిలా కనిపిస్తున్నాడు.. ఈ సందర్భంగా ఇప్పటివరకూ ఈ చిత్రం నుండి వచ్చిన అన్ని సినిమాకు హైలెట్ గా నిలిచాయి.. కుటుంబ విలువలకు చూపిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా మెహ్రీన్ అద్భుతంగా నటించింది..సినిమాలో ఉన్న దానికన్నా కూడా కెమరా చిత్రీకరణ బాగుందని చిత్ర యూనిట్ అన్నారు..

 

సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఆల్బమ్‌లోని తొలి పాటను ఆదివారం విడుదల చేశారు. వాస్తవానికి ఈ పాటను శుక్రవారమే విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఆరోజు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరగడం వల్ల ప్రజలంతా అదే మూడ్‌లో ఉన్నారు. దీంతో విడుదలను వాయిదా వేసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

 

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాట వింటుంటే చాలా రోజుల తరవాత ఒక మంచి తెలుగు పాట విన్నామనే ఫీలింగ్ కలుగుతోంది. గోపీ సుందర్ అంత బాగా స్వరపరిచారు. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. ఎస్పీబీ వాయిస్ వింటుంటే ఏదో యువ గాయకుడి గాత్రంలా అనిపిస్తోంది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాలోనూ బాలు ఒక పాట పాడారు.  అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పల్లె వాతావరణము తెరకెక్కనుంది.. సినిమా అందరికీ నచ్చుతుందని అభిప్రాపడుతున్నారు.. మరి సినిమా ఈ రేంజులో ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: