‘అల వైకుంఠపురములో’ టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన నిన్న వస్తుందని బన్నీ అభిమానులు ఆశించారు. అయితే అల్లు అర్జున్ వీరాభిమాని నూర్ భాయ్ మృతితో సినిమా టీజర్ అప్ డేట్ ను వాయిదా వేశారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు కాని లేదంటే రేపు కాని ఈమూవీ టీజర్ విడుదలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వస్తోంది. 

‘అల వైకుంఠపురములో’ మూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా దాదాపు 40 శాతం అదనపు ఖర్చులు ఈ మూవీ పై పెట్టడం జరిగింది అన్న లీకులు వస్తున్నాయి. సాధారణంగా సినిమాల బడ్జెట్ విషయంలో చాల నియంత్రణ కొనసాగించే అల్లు అరవింద్ ఈమూవీ ఖర్చు విషయంలో త్రివిక్రమ్ అనుసరించిన పద్ధతులు ముందు చేతులు ఎత్తేశాడు అని టాక్. త్రివిక్రమ్ తన సినిమాలకు సంబంధించి ఒక రూపాయి ఖర్చు అయ్యే చోట రెండు రూపాయలు ఖర్చు పెడతాడు అన్న ప్రచారం ఉంది. 

అయితే ‘సామాజవరగమన’ సూపర్ క్లిక్ కావడంతో ఈసినిమాకు సంబంధించిన ఖర్చుల విషయంలో త్రివిక్రమ్ స్పీడ్ ముందు ఈమూవీ నిర్మాతలు రాథా కృష్ణ కానీ అరవింద్ కానీ అడ్డుకట్ట వేయలేకపోయారని గాసిప్పులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాకు పాటలు హిట్ అవ్వడంతో పాటు ఈ మూవీ పై మ్యానియా విపరీతంగా పెరిగిపోయినా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కూడ ఇదే సినిమాతో పోటీగా వస్తున్న నేపధ్యంలో ఈమూవీకి అరవింద్ ఆశించిన స్థాయిలో బయ్యర్ల దగ్గర నుండి భారీ రెట్లు రాలేదని సమాచారం. 

వాస్తవానికి ఈసినిమాకు సహ నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తున్న నేపధ్యంలో బన్నీ ఈమూవీకి సంబంధించి పారితోషికం తీసుకోకుండా లాభాలలో వాటా అడిగినట్లు టాక్. ఈసినిమాకు సంబంధించి నాన్‌ థియేట్రికల్‌ థియేట్రికల్‌ అన్నీ కలుపుకున్నా కానీ నిర్మాతకి చాలా స్వల్పలాభం వస్తుందని అంటున్నారు. దీనితో ఈమూవీకి సంబంధించి హీరోగా నటించిన బన్నీ లాభాలలో వాటా అడగడంతో హీరోకి వచ్చే డబ్బుల మాట అటుంచి కనీసం దర్శకుడి పారితోషికంతో సమానంగా అయినా లాభం ఉంటుందా అన్న సందేహాలు బన్నీకి కలుగుతున్నట్లు టాక్. ఈమూవీతో కేవలం బన్నీకి పేరు తప్పించి లాభాల రూపంలో పెద్దగా కలిసి రాకపోవచ్చు అంటూ గాసిప్పులు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: