బాహుబ‌లి చిత్రం త‌ర్వాత పెద్ద హీరోలంతా దాదాపుతా ఏ చిత్ర‌మైన స‌రే భ‌రే బ‌డ్జెట్ సినిమాల‌కే ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాల కోసం వెంప‌ర్లాడుతున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబ‌లి త‌ర్వాత సాహో కూడా దాదాపు భారీ బ‌డ్జెట్ తో తీసిన చిత్ర‌మే. అయితే ప్ర‌స్తుతం తెర‌కెక్క‌బోతున్న ల‌వ్ స్టోరీ కూడా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది.  ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ నవంబర్ 18 నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. దీనికోసం ఇటలీలో ఒకప్పటి పరిస్థితులు, వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్‌లో భారీ సెట్ కూడా వేస్తున్నారు.

 


ఇక ఇదిలా ఉంటే కారణాలేమిటో తెలియదు కాని ఈ షెడ్యూల్ అనుకున్న సమయానికి ప్రారంభంకాలేదు. అయితే, ఈ షెడ్యూల్‌ను జనవరి మూడో వారానికి వాయిదా వేశారని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ఇక ప్ర‌భాస్ ఈ హాలిడేస్ ని ఎంజాయ్ చేయ‌డానికి ఆల్రెడీ విదేశాల‌కు వెళ్ళిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న తిరిగి జ‌న‌వ‌రిలో హైద‌రాబాద్‌కు వ‌స్తారు. జ‌న‌వ‌రి మూడ‌వ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.

 


కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఇక మ‌రి షూటింగ్ ఎందుకు బ్రేక్ వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే ఇటలీ లాంటి భారీ సెట్టింగ్‌కి టైమ్ ప‌ట్టేలా ఉందా. అందుకే ప్ర‌భాస్ విదేశాల‌కు వెళ్ళారా. లేక ప్ర‌భాస్ వ‌ల్లే షూటింగ్ డిలే అవుతుందా లాంటి విష‌యాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మ‌రి భారీ ప్రాజ‌క్ట్‌లు పెట్టుకున్న‌ప్పుడు కాస్త ఎక్కువ స‌మ‌యం తీసుకుకోవ‌డం మామూలే కాని దాని త‌గ్గ కార‌ణాలు ఏమిటో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: