హ్యాపీ డేస్ ఫేమ్ నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా ఈ మధ్యనే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నకిలీ సర్టిఫికెట్స్ స్కాం పై తీసిన ఈ సినిమా మంచి యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ సినిమాలో నిఖిల్‌కు జంటగా అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి నటించారు. ఇక ఈ సినిమాకు టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించారు.

 

హీరో నిఖిల్ అర్జున్ సురవరం మూవీ విజయోత్సవ సభకు గుంటూరు వెళ్లి ఆ సభ ముగిసిన తరువాత గుంటూరు నుంచి హైదరాబాద్ బయల్దేరారు, మార్గం మధ్యలో టీ తాగుదామని కారును ఆపి రోడ్డు మీద ఉన్న ఒక టీ కొట్టు దగ్గరకి వెళ్లారు, అక్కడ నిఖిల్ అర్జున్ సురవరం సినిమా పైరసీ సీడీలు చూసి అవాక్కయ్యాడు. కేవలం అర్జున్ సురవరం సినిమానే కాకుండా తాజాగా విడుదలైన అన్ని సినిమాలు ఆ టీ కొట్టు నిర్వహించే మహిళా ఒక బండిపై పెట్టి అమ్ముతోంది. వెంటనే నిఖిల్ ఈ పైరసీ వ్యవహారాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు.

 

"రోడ్డు మీద టీ తాగడానికి వచ్చిన నాకు నా సినిమా అర్జున్ సురవరం పైరసీ సీడీలు కనపడ్డాయి, నా సినిమావే కాకుండా తాజాగా విడుదలైన అన్ని సినిమా పైరసీ సీడీలు ఇక్కడ ఉన్నాయి. ఈ టీ కొట్టు నడిపే మహిళకు ఒక పాప ఉంది. ఒక సినిమాను తీయాలంటే ఎంతో మంది ఎన్నో రోజులు కష్టపడాలి. మీరు పైరసీ సీడీలు కొని సినిమా చూస్తే ఆ కార్మికులు రోడ్డున పడతారు" అంటూ నిఖిల్ చెప్పాడు.

 

ఇక ఆ టీ కొట్టు పక్కనే ఇద్దరు వ్యక్తులు ఉండగా, వారిని నిఖిల్ తన సినిమా ఎలా ఉందంటూ ప్రశ్నించాడు, బాగుందని వారు సమాధానమివ్వగా, సినిమా ఎక్కడ చూసారు అని నిఖిల్ అడిగాడు, సీడీ ప్లేయర్లో చూశామని చెప్పారు, ఈ సమాధానంతో అవాక్కయ్యాడు హీరో నిఖిల్. పైరసీని ప్రోత్సహించవద్దని టాలీవుడ్ కార్మికుల పొట్టకొట్టొద్దని నిఖిల్ అందరికీ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: