సంచలనం... వివాదాస్పదం... వైరల్ ఈ మూడు పదాల కు సరిగ్గా సరిపోయే పేరు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ దర్శకుడు చేసిన సినిమాలన్నీ వివాదాస్పదమే ఈ దర్శకుడు మాట్లాడిన మాటలు అన్నీ ఓ సంచలనమే. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంటారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. కాంట్రవర్షియల్ ట్విట్లతో... వివాదాలను రేకెత్తించే సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టాడు  రామ్ గోపాల్ వర్మ. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. 

 

 

 

 ఇక ఇప్పుడు తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తెరకెక్కించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాలు అన్నింటిని తన సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే కాంట్రవర్షియల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆంధ్ర రాజకీయాల్లోని అందరి పాత్రలూ ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. కాగా ఈ వివాదాస్పద సినిమాను వివాదాలు చుట్టుముట్టడంతో  వర్మ ఒక మెట్టు దిగి వచ్చి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు గా  ఉన్న సినిమా టైటిల్ను అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు అని మార్చేశాడు. అయితే ఈ సినిమా టైటిల్ మార్పు చేసిన అనంతరం ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ సాధించాడు రామ్ గోపాల్ వర్మ. 

 

 

 

 అయితే ఈ సినిమాకు ప్రమోషన్ స్టార్ట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. అందరు దర్శకుల్లా  కాదండోయ్ తనదైన మార్కు లోనే ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలపై అటు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు  కాగా  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనదైన మార్క్ ను చూపించాడు వర్మ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డిసినిమా విడుదల తేదీని చూస్తూ ఆనందంతో ఆలింగనం చేసుకున్నట్లుగా  ఓ ఫోటో మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా తన సినిమాలో మీ  రోల్ చేస్తున్న వ్యక్తి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు  చంద్రబాబు గారు అంటూ ట్వీట్ పెట్టారు రాంగోపాల్ వర్మ. కాగా ప్రస్తుతం వర్మ పెట్టిన ట్వీట్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: