అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్టర్ మజ్ను సినిమా ఫ్లాప్ తర్వాత సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఆఖరికి మళ్ళీ ప్రేమ కథాంశంతోనే మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.  పూజా హెగ్డే కథానాయికగా నటిసున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్  ముగించుకుంది.

 

 

అఖిల్ మరియు పూజా హెగ్డే ల మధ్య డ్యుయెట్ సాంగ్ ని సౌదీ అరేబియాలో ఎంతో ఖర్చు పెట్టి తీశారట. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ మధ్య సినిమాల్లో పాటలు తగ్గిపోతున్నాయి. ఎక్కువగా సిట్యుయేషన్ సాంగ్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దర్శకులు. స్పెషల్ సాంగ్స్ అంటే ఎప్పుడో ఒక పెద్ద సినిమాలో మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే సినిమాని కమర్షియల్ గా తీర్చిదిద్దాలంటే స్పెషల్ సాంగ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 

 


అందుకే అఖిల్ సినిమాని ఆ విధంగా తీర్చిదిద్దడానికి ఈ స్పెషల్ సాంగ్ ని చేస్తున్నారు. ఈ పాట కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రఫర్ రఘు మాస్టర్ కంపోజ్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ పాటలో ఎవరు కనిపిస్తారనే విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. అఖిల్ సినిమా అంటే ఖచ్చితంగా ఎవరో పెద్ద హీరోయిన్ తోనే చేయిస్తారు. మరి అఖిల్ తో స్టెప్పులేసే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలి.

 

మిష్టర్ మజ్ను’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమా మీద అఖిల్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సైతం చాన్నాళ్ల తర్వాత చేస్తున్న సినిమాతో నిలదొక్కుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: