మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు. ముఖ్యంగా 'సైరా' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టే హిట్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించడంతో పాటు నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. అంతేకాకుండా చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ఫాస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా 'సైరా' సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో కొరటాలతో చేయబోయే సినిమా షూటింగ్ దసరా పండుగ సందర్భంగా 'సైరా' సినిమా ఇంకా హాల్లో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న తరుణంలోనే పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిరంజీవి.

 

అయితే మరోపక్క కొరటాల శివ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చక్క చక్క చేసేస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనేక మంది పేర్లు వినబడినా చివరాకరికి అప్పట్లో చిరంజీవి కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ నే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు తాజాగా గోవాలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తో కొరటాల ఇది నా ఫోటో తో తేటతెల్లమైంది. ఇదే తరుణంలో హీరోయిన్ గా అనేక పేర్లు వినబడుతున్న అనధికారికంగా ఆల్రెడీ చెన్నై బ్యూటీ త్రిషను ఎంపిక చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

మొత్తంమీద చూసుకుంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మరియు హీరోయిన్ త్రిష వర్క్ చేయబోతున్నట్లు ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు స్టాలిన్ సినిమాలో హీరోయిన్ గా త్రిషా నటించగా ఆ సినిమాకి మ్యూజిక్ మణిశర్మ అందించడం జరిగింది. అయితే ప్రస్తుతం 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కావటంతో మెగా అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమా కోసం స్లిమ్ అయ్యే పనిలో జిమ్ లో బిజీగా కష్టపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: