దిశ అత్యాచారం హత్య కేసులో తెలంగాణ పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయటంతో ఆ విషయం దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. చాలామంది తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంపై దేశంలో ఉన్న చాలా మంది రాజకీయ నేతలు అదేవిధంగా సెలబ్రిటీలు టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన హీరో హీరోయిన్లు స్పందించారు. కాగా తాజాగా రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో తన చిన్నతనం లో ఎదురైన లైంగిక దాడుల గురించి అనేక సంచలన కరమైన విషయాలు బయట పెట్టారు. వీడియో రూపంలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ దిశ హత్యకి కారణమైన నలుగురు నిందితులను కాల్చి చంపినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పొలీసు అధికారి సజ్జనార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది శ్రీ రెడ్డి.

 

ఇకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గులను చంపడమే కరెక్ట్ అంటుంది శ్రీ రెడ్డి. ప్రస్తుతం మన సమాజంలో అమ్మాయిల ధైర్యంగా ఇంటి నుండి బయటకు వెళ్ళలేక పోతున్నారు దానికి కారణం మీరే ఆలోచించాలి అబ్బాయిలు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు శ్రీరెడ్డి తెలిపింది. మరియు అదే విధంగా తన చిన్ననాటి నుండి లైంగిక వేధింపులు దాడులు చాలా ఎదుర్కొన్నానని ముఖ్యంగా సొంత బంధువులే చిన్నతనంలో తనపై లైంగిక దాడులకు పాల్పడటం జరిగిందని ఆ సమయంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదన నరక యాతన పడటం జరిగిందని శ్రీ రెడ్డి వెల్లడించారు.

 

మరియు అదే విధంగా సమాజంలో మగాళ్ళ ఆలోచన ధోరణి లో మార్పు రావాలంటే పోలీసులకు ఆర్మీ తరహాలో హక్కులు ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా ఆడవాళ్లపై చిన్నపిల్లలపై అత్యాచారాలకు హత్యలకు పాల్పడేవారిపై వెంటనే ఎన్కౌంటర్ చేసేలా కొత్త చట్టాలు రావాలని హక్కు ఇవ్వాలని దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఈ వీడియోలో శ్రీరెడ్డి కోరింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: