ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.  నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని.. ఎంతో మంది అమ్మాయిలను కొంత మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మాయమాటలు చెప్పి అవకాశాలు ఇప్పిస్తామని తమ శారీరక సుఖం కోరుకుంటున్నారని..అలా తాను కొంత మందిని నమ్మి మోసపోయానని సంచలన వ్యాఖ్యలు చేసింది.  కాస్టింగ్ కౌచ్ పై ఓ ఉద్యమాన్నే తీసుకు వచ్చింది..కానీ ఆమె అనుకున్న ఆశయం ముందుకు సాగుతున్న సమయంలోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ అతని కుటుంబం పై పచ్చిగా మాట్లాడటంతో ఆమెపై వ్యతిరేకత పెల్లుబుకింది.  అప్పటి వరకు మద్దతు ఇచ్చిన వారంతే ఆమెకు వ్యతిరేకం అయ్యారు.  దాంతో ఆమె ప్రస్తుతం చెన్నైకి వలస వెళ్లింది. అక్కడ నుంచి పలువురు సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది.

 

ఇక బాలీవుడ్ లో సైతం తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లాంటి నటీమణులు మీ టూ ఉద్యమాన్ని తీసుకు వచ్చారు.  తాజాగా కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది నటి  మంజరి ఫడ్నిస్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని  తెలిపింది. సినీ పరిశ్రమలో కొంత మంది హీరోయిన్స్ కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తమ రంగు బయట పెడుతుంటారని..తమ  కోరిక తీర్చాలన్న విషయాన్ని తీరిగ్గా బయటపెట్టేవారని చెప్పింది.  గతంలో తనకు కూడా ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైందని.. ఓ మూవీ కోసం తనకు అడ్వాన్స్ ఇచ్చి..తనను బెడ్ రూమ్ కి పిలిచారని ఆవేదన వ్యక్తం చేసింది.  

 

ఇలాంటి వ్యవహారాలు తనకు నచ్చకపోవడంతో తనకు ఇచ్చిన అడ్వాన్స్ ను తాను తిరిగి ఇచ్చేశానని పేర్కొంది. అంతే కాదు తాను ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి.. చిన్న సినిమాలు చేయటానికి కారణం ఇదేనంటూ కుండ బద్ధలు కొట్టింది. ఇదే సమయంలో తాను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం వల్ల తన కెరీర్ ముందుకు సాగలేదన్న నిజాన్ని కూడా ఒప్పుకుంది మంజరి. తానే కాదు తనలాంటి ఎంతో మంది నటీమణులు ఆత్మాభిమానం చంపుకోలేక వచ్చిన అవకాశాలు చేజార్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. బెడ్రూంకు ఓకే అంటే తప్ప అవకాశాలు రాని పరిస్థితి ఉందని ఆరోపించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: