‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ... వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. ప్రస్తుతం వెంక‌టేష్ స‌ర‌స‌న వెంకీమామ‌, మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌క్క‌న ప్ర‌తి రోజు పండ‌గే చిత్రాల్లో న‌టిస్తుంది.  ఇక ఇప్పుడు బాలీవువ్‌లో అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు చెబుతోంది ఈ భామ‌. 

 

అతి త్వరలోనే రాశీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటి తర్వాత ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులు ఏమీ కనిపించడం లేదు! 'వెంకీ మామ`, 'ప్రతి రోజూ పండగే' ఈ రెండు సినిమాలూ విడదలకు రెడీ అయ్యాయి. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' లో కూడా రాశీ నటిస్తోందట. ఈ మూడు తెలుగు సినిమాలే ప్రస్తుతానికి రాశీ ఖాతాలో ఉన్నాయి. ఒక తమిళ సినిమాకు కూడా ఈమె సైన్ చేసినా.. ఆ ప్రాజెక్టు డిలే అవుతోంద‌ని స‌మాచారం. 

 

ఇలాంటి నేపథ్యంలో మూడు తెలుగు సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా రాశీ కెరీర్ కు ఇబ్బంది లేకపోవవచ్చు. హిట్స్ వస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. తేడా కొట్టినప్పుడే పరిస్థితి మారుతుంది. ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్‌లో రాజ్య‌మేలుతున్న సంద‌ర్భంలో ఏమాత్రం త‌ను చేసి సినిమా బెడిసి కొట్టినా క‌ష్ట‌మే.

 

ఆమెకు బాలీవుడ్ లో ఆదరణ ఉందని ఈమె అంటోంది. నటిగా రాశీ ఖన్నా ఎంట్రీ బాలీవుడ్ ద్వారానే జరిగింది. ఆ తర్వాత హిందీ లో చేసిన సినిమాలు పెద్దగా లేవు కానీ, తెలుగు-తమిళాల్లో మాత్రం బిజీబిజీగా కొనసాగిందీమె.  తిరిగి మ‌ళ్ళీ బాలీవుడ్‌లో ఛాన్స్ వ‌చ్చింద‌ని అంటోంది మ‌రి మ‌రోసారి ఆమె త‌న అదృస్టాన్ని ప‌రీక్షించుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: