బాలీవుడ్ భామ కియరా అద్వాని ఇప్పుడు మంచి ఫాం లో ఉందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో హిందీలో మరింత పాపులారిటీ తెచ్చుకున్న కియరా అద్వాని తెలుగులో కూడా మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేసింది. ఆ సినిమా హిట్ అవగా రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో నటించింది కాని ఆ సినిమా నిరాశపరచింది. తెలుగులో కూడా ఒక హిట్టు ఒక ఫ్లాప్ అందుకున్న కియరా ఇక్కడ ఆఫర్లు వస్తున్నా సరే ఓకే చేయట్లేదని తెలుస్తుంది.

 

తెలుగు ప్రేక్షకుల్లో కియరాకు బాగానే క్రేజ్ ఉంది. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆమెను హీరోయిన్ గా ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కాని ఆమె అతని సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదట. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా ఛాన్స్ కూడా వచ్చిందని తెలుస్తుంది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా కీయరా అద్వానీని తీసుకోవాలని అనుకున్నారట.

 

అయితే అమ్మడు ఆ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పిందట. నిజంగానే డేట్స్ అడ్జెస్ట్ అవట్లేదా లేక తెలుగు సినిమాల్లో నటించాలని కియరా అనుకోవట్లేదా అన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీలో కూడా ఆమెని అడిగినట్టు తెలుస్తుంది. కాని ఆ ఛాన్స్ కూడా వదులుకుందట. మరి ఇలా తెలుగులో వచ్చిన అవకాశాలను వదులుకుంటున్న కియరా అద్వానికి ఇక మీదట తెలుగు చాన్సులు రావడం కూడా కష్టమే అంటున్నారు. ఇది ఒక రకంగా కియరా తెలుగు ఫ్యాన్స్ కు చేదు వార్తని చెప్పొచ్చు.

 

తెలుగులో నటిస్తే వచ్చే క్రేజ్, రెమ్యునరేషన్ కన్నా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే వచ్చే ఇమేజ్ వేరే ఉంటుంది. అందుకే కియరా అక్కడ వచ్చిన సినిమాలన్నీ చేస్తుంది. అక్కడ ఆఫర్లు తగ్గాక కాని తెలుగులో నటిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: