టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంక్రాంతి కానుకగా రాబోతున్న సూపర్ స్టార్ మహేష్   'సరిలేరు నీకెవ్వరు'  చిత్రానికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. మొదటి సింగిల్ 'మైండ్ బ్లాక్' మాస్ నంబర్ కి  ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సాయంత్రం  'సూర్యుడివో చంద్రుడివో'  సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నారు.

 

అయితే ఈ రోజు షూటింగ్‌ జరుపుకుంటున్న మూడు  వేరువేరు సినిమాల పాటల గురించి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు వెల్లడించారు దేవిశ్రీ ప్రసాద్. అందులో  సూపర్ స్టార్ మహేష్   'సరిలేరునీకెవ్వరు'  నుండి ఒక డాన్స్ నంబర్, వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ నుండి ఒక రొమాంటిక్ మెలోడీ,  కీర్తి సురేష్ తదుపరి చిత్రం నుండి ప్రత్యేకమైన కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్ ఈ రోజు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' రీ రికార్డింగ్ పనుల్లో బిజీ గా ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. జనవరి 11, 2020 న  ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతున్న సరిలేరు నీకెవ్వరు లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్ కి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

 

 ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రతి సోమవారం ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వనున్నట్టు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తానికి సంక్రాంతి సినిమా ప్రచార రేసులో వెనకబడ్డ ఈ సినిమా ఇక నుండి సోషల్ మీడియా వేదికగా దూకుడు చూపించబోతుంది. తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్‌ షెడ్యూల్‌తో నవంబర్‌ నెలాఖరు వరకు ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ పార్ట్ మొత్తం పూర్త‌యింది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

 


సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: