టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా సూపర్ స్టార్ మహేష్ బాబే నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ గురించే.. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, లిరిక్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.  ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొన్నటి వరకు కమర్షియల్ మూవీస్ తో పాటు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉన్నవే ఎంచుకుంటూ వస్తున్నారు.  శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో మహేష్ బాబు నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు కడుపుబ్బా నవ్వించబోతున్నారట మహేష్ బాబు.  

 

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో చూస్తుంటే మహేష్ బాబు డైలాగ్స్ ని బట్టి చూస్తుంటే తెలిసిపోతుంది.  `సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు చిత్ర యూనిట్.  తాజాగా ఈ మూవీ నుంచి మైండ్ బ్లాక్ పాటను విడుదల చేసారు. ఈ పాట చూస్తుంటే గ్రామీణ వాతావరణంతో పాటు.. క్లాస్ టచ్ కూడా కనిపిస్తుంది.  సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే ఈ పాటను బి ప్రాక్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అదరగొట్టేస్తోంది. ఇక పల్లెటూరులో ఈ పాటను తెరకెక్కించినట్లు విజువల్స్‌లో అర్థమవుతుండగా.. అందులో మహేష్‌తో పాటు విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, కౌముడి, బేబి క్రితిక తదితరులు కనిపించారు.

 

రామజోగయ్య శాస్త్రి అర్థవంతమైన సాహిత్యానికి దేవీ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్లు, ప్రాక్ గాత్రం సూర్యుడివో చంద్రుడివో పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.  ఈ పాట చూస్తున్నంత సేపు ఓ అందమైన లోకేషన్ లో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. మొత్తాని ఈ పాట సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.  ఈ మూవీల చాలా కాలం తర్వాత వెండి తెరపై కనిపిస్తున్నారు విజయశాంతి.  మహేష్ బాబు సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: