ఏదైనా ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు స్టార్ హీరోకి పారితోషికం కోట్లలో ఉంటుంది. అతనిని డైరెక్ట్ చేస్తున్నది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా అతనికి హీరో పారితోషికంలో సగం లేదా మహా అంటే అతని కన్నా తక్కువ మొత్తమే ముడుతుంది. కానీ ఈ హీరో మరియు డైరెక్టర్ విషయంలో మాత్రం అలా కాదు. హీరో కన్నా ఎక్కువ డబ్బులు దర్శకుడే తీసుకుంటున్నాడు. వారిద్దరే హిట్ పెయిర్ గా పేరొందిన నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శీను.

 

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తరువాత బాలయ్య .. బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్యకు తొలిసారిగా 10 కోట్ల పారితోషికం ముట్టబోతుంది అన్న మాట వినిపిస్తుంది. ఇప్పటివరకు బాలకృష్ణ ఒక సినిమాకి పారితోషికంగా అత్యధికంగా 9 కోట్లు తీసుకున్నాడు. అది కూడా ఈ నెల 20వ తేదీ న విడుదల కానున్న రూరల్ సినిమా కు కావడం గమనార్హం. 


ఇక హీరో మరియు డైరెక్టర్ల పారితోషికం కే పాతిక కోట్లు అయితే మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మరియు ఇతర్ ముఖ్య టెక్నీషియన్స్ కు అంతా కలిసి కనీసం ఏడు కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక మన బోయపాటి గారి చేతిలో సినిమా పడిందంటే దాన్ని బడ్జెట్ మామూలుగా ఉండదు. ఎంత తక్కువ వేసుకున్నా ఆయన తన స్టైల్ లో తీస్తే 70 కోట్లు వరకూ ఖర్చు అవుతుంది. బాలయ్య బాబు సినిమాకి 70 కోట్ల బడ్జెట్ అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అందుకే మైత్రి మూవీస్ వారు ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకోగా ఇప్పుడు మిరియాల రవీందర్ రెడ్డి రంగంలోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: