విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అటు వరుస విజయాలతో ఓటమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది పెద్ద వైరల్ గా మారిపోతుంది. కాగా అటు చిత్ర బృందం కూడా ప్రతి వారం అభిమానుల కోసం కొత్త కొత్త అప్డేట్ లు ఇస్తూనే ఉంటామంటూ శుభవార్త ఇటీవల చెప్పిన విషయం తెలుసు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన వచ్చి రికార్డులు సృష్టించింది కూడా. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. సూర్యుడివో చంద్రుడివో ఇద్దరి కలయికవో అంటూ ఈ పాట సాగుతుంది. కాగా ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కథానాయకుడి మహోన్నతమైన వ్యక్తిత్వం ఆవిష్కరిస్తూ సాగే పాట ఇది అంత చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ పాటను రాసిన రామజోగయ్యశాస్త్రి... చాలా తేలికైన అందరికీ అర్థమయ్యేలా అద్భుత అర్థాన్నిచ్చేలా ఉండే పదాలతో పాటను రాశారు.
అయితే సరిలేరు నీకెవ్వరు సినిమలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ అందాల భామ రష్మిక మందన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా దాదాపు పదమూడేళ్ళ తరవాత విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి ముందు రోజు విడుదల కానుంది. అయితే ఈ సినిమా రోజురోజుకు అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు మొదటి సారిగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మేజర్ అజయ్ కృష్ణగా నటించబోతున్నారు.