రాం గోపాల్ వర్మ తన మాటలతో ప్రవర్తనలతో, సినిమాలతో ఎంతగా సంచలనం అయ్యాడో అంతకంటే ఎక్కువగా శ్రీరెడ్డి సంచలనం అయిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమలో చాలామంది తనకు వేశాలిస్తామని వాడుకొని వదిలేశారని ఎప్పుడు నానా రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయింది. ఇక రీసెంట్‌గా దిశ అత్యాచారం, హత్య కేసులో తెలంగాణ పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయటంతో ఆ విషయం దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే.   తెలంగాణ పోలీసులు  ఎన్‌కౌంటర్ చేయడాన్ని సమర్ధించడమే కాకుండా ఇకపై ఇలాంటి వాళ్ళకి ఇటువంటి శిక్షలే విధించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేశంలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు,  సెలబ్రిటీలు టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన హీరో హీరోయిన్లు స్పందించారు. 

 

ఇక తాజాగా రెడ్డి ఇదే అంశం గురించి మాట్లాడుతు తన చిన్నతనంలోను ఎదురైన లైంగిక దాడుల గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. శ్రీ రెడ్డి దిశ హత్యకి కారణమైన నలుగురు నిందితులను కాల్చి చంపినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పొలీసు అధికారి సజ్జనార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న కీచకులను నిర్ధాక్షణంగా అంతం చేయడే సరైన న్యాయం అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రతీ రోజు అమ్మాయిలు ధైర్యంగా బయటకు వెళ్ళలేక పోతున్నారంటే అందుకు కారణం మీరే.. అబ్బాయిలు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 

 

ఇక పనిలో పనిగా తన చిన్నప్పటి నుండి లైంగిక వేధింపులు వేధింపులు చాలానే ఎదుర్కొన్నానని అందులోను సొంత బంధువులే చిన్నతనంలో తనపై లైంగిక దాడులకు పాల్పడ్డారని.. ఆ సమయంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదన, నరక యాతన పడ్డానని శ్రీ రెడ్డి వాపోయింది. అందుకే సమాజంలో ఆడవాళ్ళ పట్ల మగాళ్ళ ఆలోచన ధోరణి మారాలంటే పోలీసులకు ఆర్మీ తరహాలో హక్కులు ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా ఆడవాళ్లపై చిన్నపిల్లలపై అత్యాచారాలకు హత్యలకు పాల్పడేవారిపై వెంటనే  ఎన్‌కౌంటర్ చేసేలా కొత్త చట్టాలు రావాలని హక్కు ఇవ్వాలని దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఈ సందర్భంగా తెలిపింది. మరి శ్రీ రెడ్డి ఇన్ని మాట్లాడే ముందు తను గతంలో చేసిన పనులన్ని కరక్టేనా అంటూ కొంతమంది రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: