దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా హత్య కేసుపై తాజాగా అలనాటి బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని అస్సలు క్షమించకూడదని అంటున్నారు. అంతేకాదు ఆమె అభిప్రాయాలు కాస్త షాకింగ్‌గా, కాస్త ఆలోచింపజేసే విధంగా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకముందు జనసేనాని, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన విచిత్ర వ్యాఖ్యలపై సినీ నటులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డ విషయం కూడా తెలిసిందే. 

 

‘నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడేవారిని అస్సలు క్షమించకూడదు. అదే విధంగా ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు కూడా మనకు లేదు. రేపిస్ట్‌లకు జీవిత ఖైదు శిక్షలు వేయాలి. ఇలాంటి కేసుల్లో లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు. రేపిస్ట్‌లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినప్పుడు వారిపై కేసులు పెట్టడం ఎందుకు? అలా చేయడం వల్ల ప్రజల సొమ్ము వేస్ట్ అవతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ ప్రాసెస్‌లను ఫాలో అవ్వకుండా రేపిస్ట్‌లకు జీవిత ఖైదు శిక్షలు వేస్తే మంచిది’ అని తెలిపారు. వహీదా వ్యాఖ్యలు కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అలా చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని వ్యతిరేకిస్తున్నారు. నిజమే కదా అలా జీవిత ఖైదు శిక్షలు వేయడం వల్ల ఒరిగేదేమి ఉండదు. ఇలాంటి వాళ్ళకే ఉరి శిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయడమే కరెక్ట్ అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.  

 

ఈ ఘటనపై ఇప్పటికే ఎందరో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. దిశ నిందితులను ఇటీవల తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు పోలీసులను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ వార్త గురించి అంతర్జాతీయ పత్రికలు, మీడియా కూడా కవర్ చేయడం విశేషం. ఇకమీదట ఆడపిల్లలపై ఇలాంటి ఘోరమైన నేరాలను పాల్పడేవారిని ఇలాగే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నిర్భయ ఘటన కూడా ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: