అందాల నటి కీర్తి సురేష్ నటన, అభినయంతో తెలుగు ఫ్యాన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఆమె ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్స్లలో ఒకరుగా రాణిస్తున్నారు. రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్.. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాలో నటించింది.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. తెలుగు సినిమా 'మహానటి'తో స్టార్ స్టేటస్తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది కీర్తి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది.
మహానటి సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలోని ఆమె నటనకు ఆఫర్లు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్టెట్ సినిమాలు కీర్తి సురేష్ ని హీరోయిన్గా ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘సిరుతై’ శివ దర్శకత్వంలో సూపర్స్టార్ రజనీకాంత్ తన 168వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి, సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే కార్తీ ఖైదీ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలోనూ కీర్తిసురేష్ నటించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తాయి.
కీర్తి సురేష్ ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు మరింత చేరువకానుంది. అయితే ఈ సినిమా కీర్తి సురేష్ కీర్తిని ఎంత వరకు పెంచనుందో చూద్దాం.. మొత్తానికి కీర్తి సురేష్ ఇటు తెలుగు ప్రేక్షకులను అటు తమిళ ప్రేక్షకులను తన నటతో ఆటుకట్టుకొంటోదనడంతో ఎలాంటి సందేహం లేదు.