టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, 

 

రత్నవేలు ఫోటోగ్రఫిని, తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు సాంగ్స్ బయటకు వచ్చి శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. కాగా వాటిలో నిన్న సాయంత్రం రిలీజ్ అయిన సూర్యుడివో చంద్రుడివో అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. యువ పంజాబీ సింగర్ బి ప్రాక్ పాడిన ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి ఎంతో గొప్పగా సాహిత్యాన్ని అందించడం జరిగింది. 

 

కాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో అత్యంత వేగంగా 100k లైక్స్ సాధించిన సాంగ్ గా ఒక అద్భుతమైన రికార్డు ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఈ లిరికల్ సాంగ్ లో మహెష్ బాబు మరియు విజయశాంతి సహా మరికొందరు నటులు కలిసి నటించారు. చాలా గ్యాప్ తరువాత విజయశాంతి గారు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రంగప్రవేశం చేస్తుండడం, అలానే అంత గ్యాప్ వచ్చినప్పటికీ ఈ సాంగ్ లోని కొన్ని సీన్స్ లో మహేష్ తో కలిసి ఆమె ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: