యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటి జయసుధ మరియు మరొక నటి భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, నందమూరి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన సంపాదించడంతో పాటు, సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేయడం జరిగింది. 

 

ఇక ఇటీవల బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండూ ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో, బాలయ్య కూడా కొంత ఆలోచన చేసి, గత ఏడాది తనకు జైసింహా వంటి విజయవంతమైన సినిమాని తీసిన కేఎస్ రవికుమార్ కే మరొక అవకాశాన్ని ఇచ్చారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కతున్న ఈ రూలర్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడం తో పాటు అతి త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కూడా జరుపుకోబోతోంది. కాగా ఈ సినిమా ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తరువుత బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

 

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మతగా నిర్మితం అవుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కాబోతోంది. కాగా ఈ సినిమా విషయమై నేడు ప్రచారం అవుతున్న ఒక వార్తను వింటే మనకు షాక్ కొట్టక మానదు. అదేమిటంటే, ఈ సినిమా కోసం హీరో బాలయ్య కంటే దర్శకుడు బోయపాటికే  ఒకింత ఎక్కువ రేంజ్ లో నిర్మాత రెమ్యూనరేషన్ సమర్పించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన తీసిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా బోయపాటి క్రేజ్ మాత్రం తగ్గకపోవడంతోనే అంత హై రేంజ్ లో బోయపాటికి రెమ్యూనరేషన్ ముట్టినట్లు టాక్. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: