ఇటీవల కాలంలో మనిషి డిజిటల్ గా ఎంత గొప్పగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ కూడా మానసికంగా మాత్రం కొన్ని విషయాల్లో రాను రాను ఎంతో నీచంగా ఆలోచిస్తున్నాడు అనడానికి ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ ఘటన అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. అయితే అందరూ ఆ విధంగానే తప్పుగా ఆలోచిస్తున్నారా అంటే కాదు అనే చెప్పాలి, ఎందుకంటే ఎక్కడో కొందరు పనికిమాలిన వాళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల మెజారిటి ప్రజలు నిందను మోయవలసి వస్తోందనేది వాస్తవం. ఇక వివరాల్లోకి వెళితే, నిన్న ఉదయం ఢిల్లీ లోని మెట్రో ట్రైన్ లో ఎక్కిన ఒక యువ జంట, 

 

ముందుగా కొద్దిసేపు అందరిలానే మాములుగా కూర్చుకుని కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ఒక్కసారిగా ఒకరిపైకి మరొకరు ఎక్కి విపరీతంగా ఒకరి అధరాలు మరొకరు చుంబించుకోవడం మొదలెట్టారు. ఇక ఆ షాకింగ్ ఘటనతో తోటి ప్రయాణీకులందరూ అమాంతం నిర్ఘాంతపోవలసి వచ్చింది. అయితే తమను ట్రైన్ లోని చుట్టుప్రక్కల వారందరూ చూస్తున్నారు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ జంట ముద్దులు పెట్టుకోవడం మరింత ముదురిపోయింది. ఇక ఈ ఘటనను కొందరు తమ సెల్ ఫోన్స్ లో చిత్రికరించి ఢిల్లీ మెట్రో రైల్ అధికారులకు కంప్లైంట్ చేసారు. 

 

సభ్యసమాజంలో నలుగురితో కలిసి జీవిస్తున్నపుడు సభ్యత, సంస్కృతి ని మరిచి ఆ విధంగా తప్పుగా ప్రవర్తించిన యువ జంటను పట్టుకుని తగిన శిక్ష విధించాలని పలువురు ప్రయాణీకులు పొలిసు అధికారులను కోరడం జరిగింది. కాగా ఆ ఘటన తాలూకు వీడియోలు పరిశీలించిన పోలీసులు, వీలైనంత త్వరలో వారిని గుర్తించి తగి రీతిన దండన విధిస్తాం అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఆ జంట తాలూకు ఫోటోలు నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సంఘంలో కొందరు చేసే ఇటువంటి నీచమైన పనుల వలన మిగతా యువత కూడా చెడిపోతున్నారని, కావున ఇటువంటి వారికి తగిన శిక్ష విధించాల్సిందే అని పలు ప్రజా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: