తెలుగు జాతి గర్వ పడే సినిమా తీశాడు జక్కన్న రెండు సంవత్సరాల కిందట వచ్చిన బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. ప్రతీ ఇండస్ట్రీలోనూ కూడా ఆ రోజుటికి ఉన్న రికార్డులను బాహుబలి చెదరగొట్టేందుకు. రాజమౌళి చేసే తదుపరి చిత్రం కోసం దేశమంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది. రాజమౌళి ప్రస్తుతం ఆర్. ఆర్. ఆర్  సినిమా తో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.

 

తెలుగులో ఈ తరంలో ఇద్దరు పెద్ద హీరోలు  కలిసి పనిచేయడం ఇదే తొలిసారి కావచ్చు.  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ కి జోడిగా అందాల తార ఆలియా భట్ ఈ సినిమాలో నటిస్తుంది. అలాగే ఎన్టీఆర్ కి జోడిగా ఒలివియా మోరిస్ జంటగా నటిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా డి.వి.వి.దానయ్య ఈ సినిమాని దాదాపు 350 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఒకేసారి పది భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయిందని గత నెలలో ప్రకటించారు యూనిట్ సభ్యులు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు  తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకి వచ్చే నెల 10 వ తారీఖున గుమ్మడి కాయ కొట్టే అవకాశం కనిపిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

 

సంక్రాంతికి ముందే ఈ సినిమాని పూర్తి చేయాలని రాజమౌళి షూటింగ్ చేస్తున్నట్లు అందరూ చెప్తున్నారు. ఈ వార్తపై ఇంకా అధికార ప్రకటన ఏమి రాలేదు. ఫిబ్రవరి నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి జూన్  ఆఖరికి ముగించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు అందరికి తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: