శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. మహర్షి ఇలా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ బాక్సాఫీస్ని ఒక రేంజ్ లో షేక్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ఎమోషన్ కామెడీతో కూడిన ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అనిల్ రావిపూడి. కాగా ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలు మహేష్ బాబు మొదటి సారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాదండోయ్ ఈ సినిమాలో దాదాపు పదమూడేళ్ళ తరవాత టాలీవుడ్ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇంకేముంది ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. అటు చిత్రబృందం కూడా మహేష్ బాబు అభిమానుల కోసం ప్రతి వారం సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తామంటూ తెలిపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే చిత్రబృందం చెప్పినట్లుగానే నిన్న ఓ లిరికల్ సాంగ్ ని విడుదల చిత్ర బృంధం. సరిలేరు నీకెవ్వరు నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.
సూర్యుడివో... చంద్రుడివో అంటూ మొదలయ్యే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఏకంగా ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే రెండున్నర మిలియన్ల వ్యూస్ కి చేరుకుంది ఈ పాట. గతంలో మహేష్ బాబు పేరుతో ఉన్న రికార్డును ఈ పాట అధిగమించేలా ఉందని అనుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాలు మహేష్ బాబు పాత్ర వ్యక్తిత్వాన్ని తెలియపరచేలా ఈ పాట సాగిపోతూ ఉంటుంది. అయితే ఈ పాటను రాసిన రామజోగయ్య అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుత పదాలను వాడుతూ పాటను రాశారు.