వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా పోటీకి వస్తుంది. మొదట్లో రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ డేట్ ప్రకటించగా నిర్మాతల జోక్యంతో రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ముందు జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించాయి. అయితే మహేష్ సినిమాను ఒకరోజు ముందుకు మార్చారు.

 

సో మహేష్ సరిలేరు నీకెవ్వరు జనవరి 11నే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఎనౌన్స్ చేసినట్టుగానే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మాత్రం జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ క్రేజీగా మారింది. సంక్రాంతి సినిమాల మధ్య పోటీ కామనే కాని మహేష్ వర్సెస్ బన్ని ఫైట్ డిఫరెంట్ అని చెప్పొచ్చు.

 

ఓ పక్క సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమా గురించి నెగటివ్ గా వార్తలు స్ప్రెడ్ చేస్తుంటే.. మెగా ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మహేష్ సినిమా మీద రకరకాల వార్తలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అల వైకుంఠపురములో సాంగ్స్ సూపర్ హిట్ అవగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సరిలేరు నుండి వచ్చిన రెండు సాంగ్స్ పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాంక్ మాస్ ఆడియెన్స్ ను అలరించగా రీసెంట్ గా రిలీజైన సూర్యుడివో చంద్రుడివో సాంగ్ విన్న మహేష్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

 

సినిమా కంటెంట్ విషయంలో నమ్మకం పెట్టుకున్న ఫ్యాన్స్ సాంగ్స్ విషయంలో మాత్రం నిరుత్సాహ పడుతున్నారు. దేవి తన మ్యాజిక్ చూపించట్లేదని ఫీల్ అవుతున్నారు. సరిలేరు సాంగ్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలని ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాల మధ్య ఫైట్ మరింత ముదిరేలా ఉంది. సాంగ్స్ తోనే ఇలా ఉంటే రేప్పొద్దున్నే సినిమా రిలీజ్ తర్వాత కలక్షన్స్ గురించి ఎలా ట్రోల్స్ చేస్తారో అంటూ డౌట్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: