టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా చెలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పై కొంత కాలంగా సినీ పరిశ్రమలో ఒకరకమైన రూమర్లు పుట్టుకొస్తున్నాయి. వీరి మద్య బేధాభిప్రాయాలు వచ్చాయని.. వీరిద్దరు బద్దశత్రువులుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాదు ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు సైతం తన వీడియోలో బాలయ్య పై రక రకాల కామెంట్స్ చేశారు. తానకు పాత తరం బాలయ్య కమెడియన్ గా తెలుసని ఆ తర్వాత సీనియర్ నటులు బాలయ్య తెలుసని ఆయన గొప్ప నటుడు అని అన్నారు. దాంతో నందమూరి ఫ్యాన్స్ చిర్రెత్తుకొచ్చి నాగాబాబుపై ట్రోలింగ్ చేశారు.
ఆ తర్వాత బాలయ్య గతంలో పవన్ పై చేసిన కామెంట్స్ గుర్తుకు తెచ్చారు నాగబాబు. ఇలా నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ కి మద్య వార్ మొదలైంది. దాంతో చిరు, బాలయ్య మద్య కూడా వైరం కొనసాగుతుందని భావించారు. కానీ అన్ని రూమర్లకు చెక్ పెడుతూ.. మెగాస్టార్ చిరంజీవి,నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించి ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర లాంచ్ సమయంలో వీరిద్దరు ఒకే వేదికని పంచుకోగా, మళ్ళీ సి.కళ్యాణ్ బర్త్డే వేడుకలో కలిసి కనిపించారు.
ఈ మధ్య 80 కాలం నాటి తారలందరు చిరు ఇంట్లో రీయూనియన్ వేడుక జరుపుకోగా, ఆ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరు కాలేదు. దీంతో చిరుకి, బాలయ్యకి విబేధాలు వచ్చాయింటూ పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రూమర్లకు చెకె పెడుతూ బాలయ్య, చిరు ఒకే వేదికపై సంతోషంగా కనిపించారు. తాజా ఫోటోలని బట్టి చూస్తుంటే వీరిద్దరి మధ్య సఖ్యత అలానే కొనసాగుతుందని తెలుస్తుంది. కాగా, సి. కళ్యాణ్ 60 వ బర్త్ డే వేడుకలు నిన్న సాయంత్రం తాజ్ కృష్ణ హోటల్లో జరిగాయి. అతిరథమహారధులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, చిరు, బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.