సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఆర్మీ మేజర్ గా మహేష్ కర్నూలు సిటీకి వచ్చి ఏం చేశాడు అన్నది సినిమా కథ. సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.

 

అయితే సినిమాలో రష్మిక ఉందన్న మాటే తప్ప ఇంతవరకు ఆమెకు సంబందించిన ఎలాంట్ అప్డేట్ లీక్ చేయలేదు. ఎప్పుడో ఒక పోస్టర్ వదిలారు అంతే. టీజర్ లో ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. పోని సాంగ్స్ లో అయినా ఉంటుందని భావించిన రష్మిక ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఛలో, గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ వంటి క్రేజీ సినిమాలతో తెలుగులో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక.

 

ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉండగా ఆమెకు ఇక్కడ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. సరిలేరు నీకెవ్వరు టీం మాత్రం రష్మికను అసలు ఇంతవరకు రివీల్ చేయలేదు. ఓరకంగా రష్మికకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రమోషన్స్ లో ఏమైనా రష్మికను వాడుకునే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. సరిలేరు ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి మొదటి వారంలో జరుగనున్నాయి. ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రాం చరణ్ గెస్ట్ గా వస్తాడని తెలుస్తుంది.

 

భరత్ అనే నేను, మహర్షి సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ హిట్ల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా హ్యాట్రిక్ హిట్ కొడుతుందని ఆశిస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఎలాగు సక్సెస్ ఫుల్ డైరక్టర్ కాబట్టి సినిమా కచ్చితంగా హిట్ అనేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: