సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై దుమ్ము దులుపుతోంది. ప్రేక్షకుల నుండి టీజర్ కి విశేష స్పందన లభించింది. అయితే ఈ సినిమా నుండి ప్రతీ సోమవారం ఒక పాట విడుదల అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో మొదటి పాట మైండ్ బ్లాక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పూర్తి మాస్ బీట్స్ తో సాగిన ఈ పాట ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించింది. ఆ పాట ఇంకా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండగానే రెండో సోమవారం మరో పాట రిలీజ్ అయింది. ఈ సోమవారం మెలోడీతో మన ముందుకు వచ్చాడు. సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగిన ఈ పాట మొదటి పాట కంటే చాలా బాగుంది. చాలా కొత్త బీట్ తో ప్రశాంతంగా సాగిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది.

 

ఈ పాటను దేవిశ్రీ  స్వరపరచగా సింగర్ బి ప్రాక్ ఆహ్లాదంగా పాడారు. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం పాటకు అదనపు ఆకర్షణ అయ్యింది. పాటను చూస్తుంటే విజయ శాంతి కుటుంబానికి అండగా వచ్చిన మహేష్ పాత్రను ఎలివేట్ చేస్తూ ఈ పాట వస్తుందని అర్థం అవుతుంది. ఇక నిన్న సాయంత్రం విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంటుంది.పాట విడుదలై ఇంకా 24గంటలు కూడా గడవక ముందే రెండున్నర మిలియన్స్ వ్యూస్ కి చేరువైంది. 

 

ఈ సాంగ్ తో మహేష్ గతంలో ఉన్న యూ ట్యూబ్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రెండు పాటలు మరియు ఒక టీజర్ తో ఈ సినిమాకి చాలా హైప్ వచ్చింది. మొదటి పాటలో మాస్ బీట్స్ తో అలరించిన దేవిశ్రీ ప్రసాద్, రెండవ పాటలో మెలోడీతో ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా అలరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: