నివేథా పేతురాజ్...మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తమిళ భామ ఆ తర్వాత వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాలో కనిపించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న "అల వైకుంఠపురములో" చిత్రంలో నటిస్తుంది. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే నటించగా నివేధ పేతురాజ్ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తుందట. అయితే ఈ సినిమా విజయం కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తుందట.

 

పెద్ద స్టార్ అయిన అల్లు అర్జున్ తో కలిసి నటిస్తే తనకి అవకాశాలు వస్తాయని అనుకుంటుంది. సినిమా బాగుంటే నిజంగా నివేధాకి మంచి అవకాశాలే దక్కుతాయి. అయితే అదలా ఉంచితే ఈ సినిమాలో నివేధా అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసిందట. అల్లు అర్జున్ ఎంత మంచి డాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి స్టెప్పునైనా చాలా అలవోకగా, స్టైలిష్ గా చేసి ప్రేక్షకుల  చేత వావ్ అనిపిస్తాడు.

 

అలాంటిది అల్లు అర్జున్ సరసన డాన్స్ చేయాలంటే ఏ హీరోయిన్ అయినా చాలా కష్ట పడాల్సిందే. నివేధా పేతురాజ్ కూడా అలానే కష్టపడిందట. ఈ సినిమాలోని రాములో రాములా' పాటలో బన్నీతో కలిసి డాన్స్‌ చేసిన నివేత ఆ పాటలో బన్నీ మెరికల్లాంటి చిందులకి విస్తుపోయిందట. ఇంత గొప్ప డాన్సర్‌ని ఎక్కడా చూడలేదంటూనే అతనితో డాన్స్‌ చేయాలంటే తాతలు దిగొస్తారని చెబుతోంది. ఇంకోసారి బన్నీతో నటించే ఛాన్స్‌ వస్తే మాత్రం ముందుగానే నాట్యంలో తర్ఫీదు తీసుకుని తగిన రీతిన ప్రిపేర్‌ అయి వస్తానంటోంది.

 


రాములో రాములా పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఎనభై ఐదు మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ప్రేక్షకుల్లో హుషారు తెప్పించిన ఈ పాటకి డాన్స్ చేయాలంటే, అదీ అల్లు అర్జున్ తో చేయాలంటే నిజంగా కష్టమే. మరి ఈ అమ్మడు ఎంతలా కష్టపడిందో చూడాలంటే సినిమా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: