'బాహుబలి' సినిమా తో దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన టాప్ టాప్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆయన డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు సినిమా మొదలు పెట్టడం కోసం రెడీగా ఉన్నట్లు చాలా మంది డైరెక్టర్లు మరియు నిర్మాతలు ఇప్పటికే బహిరంగంగా తెలియ చెప్పడం జరిగింది. ఒక్క క్రేజ్ తో మాత్రమే కాకుండా చాలా విషయాలలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలకు పోటీ ఇస్తున్న ప్రభాస్ తో దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది పెద్దపెద్ద డైరెక్టర్లు సినిమా చేయడానికి ప్రస్తుతం రెడీగా ఉంటున్న తరుణంలో తాజాగా ప్రభాస్ సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

ప్రస్తుతం శంకర్ కమల హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్ అయిన వెంటనే ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ శంకర్ వున్నట్లు కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఇందుకోసం ఇప్పటినుండి దిల్ రాజు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

అంతేకాకుండా ఈ సినిమాని శంకర్ భారీ లెవల్లో భారీ బడ్జెట్ స్థాయిలో ఉండేటట్లు అటువంటి స్టోరీని ప్రభాస్ కోసం రెడీ చేస్తున్నట్లు దీంతో నిర్మాత దిల్ రాజు కి భారీ స్థాయిలో బడ్జెట్ వుండేటట్లు శంకర్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఇటీవల రజనీకాంత్ మరియు విక్రమ్ వంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో అదే స్థాయిలో ప్రభాస్ తో కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయాలని శంకర్ రెడీగా ఉన్నట్లు సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: