ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తాని చాటి, తెలుగు సినిమాను  పునర్నిర్వచించిది, ఈ సినిమా తో డార్లింగ్ ప్రభాస్ పాన్-ఇండియా స్టార్ అయ్యారు. ప్రభాస్ డబుల్ రోల్ లో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం, ప్రభాస్ సెలవులను ఆస్వాదిస్తున్నారు, తన వెకేషన్ ముగిసిన తరువాత, ప్రభాస్ తన తదుపరి చిత్రం జాన్ చిత్రీకరణను ప్రారంభిస్తారు.

 

చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, రోబో 2.0 మరియు ఐ సినిమాతో ప్రాచుర్యం పొందిన శంకర్ తన తదుపరి చిత్రం కోసం ప్రభాస్‌తో జతకట్టబోతున్నారు. నటుడు ప్రభాస్‌ను పెద్ద చిత్రంతో ఆశీర్వదించాలని శంకర్ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సాహోలో కనిపించాడు, దీనిలో అతను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తో జతకట్టారు. తెలుగు వెర్షన్ వాణిజ్యపరంగా ఫ్లాప్ అయినప్పటికీ హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. 

సాహోతో, భారతదేశం అంతటా ప్రభాస్ పేరు మార్మోగిపోయింది.

 

తాజాగా శంకర్ సాహో స్టార్ ప్రభాస్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. శంకర్ మరియు ప్రభాస్ చిత్రం సామాజిక సందేశాన్ని ఇచ్చేలా ఉంటుందని సమాచారం. ఒకవేళ అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, ప్రభాస్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, వీరి చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. మరోవైపు డైరెక్టర్ శంకర్ 1996 క్లాసిక్ భారతీయుడు సినిమా యొక్క సీక్వెల్ అయిన భారతీయుడు 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు, ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2021 లో థియేటర్లలోకి రానుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కమల్ కు జోడిగా నటిస్తున్నారు.

 

ప్రభాస్ తన తదుపరి రొమాంటిక్ డ్రామా జాన్ సినిమా షూటింగ్ కి  సిద్దం అయ్యాడు, ఇందులో 'డీజే' బ్యూటీ పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి నెల నుంచి ప్రారంభం కానుంది. krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించనున్నారు మరియు యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: