మెగా బ్రదర్ నాగబాబు ఇన్నిరోజులపాటు బుల్లితెర రారాజుగా వెలిగారు. ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ తో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే జ‌బ‌ర్థ‌స్త్ షో నుంచి నాగబాబు బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంలో ఎమ్మెల్యే రోజా ఒక్కరే ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో ఎవరైనా తమ సినిమా ప్రమోషన్ కోసం ఈ షోకు వస్తే ఆయా హీరోలు నాగబాబు సీట్లో కూర్చుంటున్నారు. ఇక జబర్ధస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘లోకల్ గ్యాంగ్స్‌‌’ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు నాగబాబు.  జీ టీవీకి షిప్ట్ అయిన టవర్ స్టార్ అక్కడ వరుస ప్రొగ్రామ్స్‌తో దుమ్ములేపుతున్నారు.

 

ఇప్పటికే లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మరో ప్రోగ్రాంలో సైతం చీఫ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 'అదిరింది' పేరిట ప్రారంభానికి సిద్ధమవుతున్న రియాలిటీ షోలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి ఆయనతో పాటు కొంతమంది టీమ్ లీడర్లు కూడా వెళ్లిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లంతా వేరే ఛానల్ వారి కొత్తగా కార్యక్రమంలోను కనిపించారు. అయితే నాగబాబుతో కలిసి బయటికి అడుగుపెట్టిన వాళ్లలో కొందరు అప్పుడే ఆయనకి హ్యాండ్ ఇచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇక తాజాగా నాగబాబు నిర్వహిస్తున్న అదిరింది షో నుంచి వదిలిన ప్రోమో, ఆ వార్త నిజమే అన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

 

ఈ ప్రోమో కాన్సెప్ట్ విషయానికి వస్తే.. రంగస్థల నాటకానికి అంతా సిద్దమై ఉంటుంది.  ఇంత‌లో ఎమ్మెల్యేగా ఓ లేడీ కేరక్టర్, కమెడియన్ అంటూ మరో కేరక్టర్ వచ్చినప్పటికీ షో స్టార్ట్ చేయరు. అయితే నాగబాబు స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఓ డైలాగ్ కూడా వదిలారు. అందులో `ఎంత మంది ఉన్నామన్నది కాదురా... ఎవడున్నాడన్నది ముఖ్యం.. మొదలు పెట్టండి...`అంటూ సాగే ఈ ప్రోమోపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ ప్రారంభమైంది. వాస్త‌వానికి వ్యూస్ పరంగా రెస్పాన్స్ బాగానే ఉన్నా.. నెగిటివిటీ కూడా కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉందని చెప్పాలి. మ‌రోవైపు ఈ ప్రోమో నేరుగా జబర్దస్త్ ను టార్గెట్ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో చర్చ స్టాట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: