గుడివాడకు చెందిన సంబి రెడ్డి అనే వ్యక్తి ఉల్లిపాయలు రైతు బజార్ దగ్గర తీసుకోవడానికి నిలబడిన సందర్భంలో చనిపోయారని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మరియు ఆ పార్టీకి చెందిన ఎల్లో మీడియా వైసీపీ ప్రభుత్వం పై జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా కొడాలి నాని షాకింగ్ కామెంట్ చేశారు. అసలు చనిపోయిన వ్యక్తి చాలా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని అటువంటిది అలాంటి వ్యక్తిని పట్టుకుని ఉల్లిపాయల కోసం వెళ్లి చనిపోయాడని చంద్రబాబు శవాలతో రాజకీయాలు చేస్తున్నారని….దొరక దొరక ఒక్క శవం దొరికిందని చంద్రబాబు నిచ్చమైన రాజకీయాలు చేశారని కొడాలి నాని మండిపడ్డాడు. ఇదే క్రమంలో కొడాలి నాని ఆ కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో వీడియో రూపంలో ప్లే చేసి చూపించారు.

 

వీడియో లో కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఉల్లిపాయల కోసం రైతు బజార్ ముందు నిలబడాల్సిన కర్మ లేదని చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అని పేర్కొన్నారు. కావాలని కొన్ని పత్రికలు కొన్ని మీడియా చానళ్లు మరియు కొంతమంది పార్టీలు తమ కుటుంబ సభ్యులు చనిపోయిన దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని సదరు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇవ్వటం జరిగింది.

 

దీంతో కొడాలి నాని మాట్లాడుతూ శవ రాజకీయాలు చేయడానికి గుడివాడ తెలుగుదేశం పార్టీ జాగీరు కాదని అక్కడ కొడాలి నాని అనే వ్యక్తి ఉన్నాడని గుర్తు పెట్టుకోవాలి అంటే చంద్రబాబుకి ఘాటుగా అసెంబ్లీ సాక్షిగా కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ సభ్యులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం పట్ల షేమ్..షేమ్ అంటూ కామెంట్లు చేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: