టాలీవుడ్ లో ఈ మద్య మాలీవుడ్ బ్యూటీలు వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు.  రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్.  ఆ వెంటనే నాని హీరోగా ‘నేను లోకల్’ తో మరో విజయం అందుకుంది.  ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల తార సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి మూవీలో ప్ర‌ధాన పాత్ర పోషించిన న‌టి కీర్తి సురేష్‌. అచ్చం సావిత్రిగా మంచి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించిన ఆమె పాత్ర‌పై విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి.  దాంతో తెలుగు, త‌మిళం, హిందీలో ప‌లు సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి. ‘మహానటి' మూవీతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేష్.  

 

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించాలన్న కోరిక తప్పకుండా ఉంటుంది... ఆయనకు ఉన్న పాపులారిటీ అలాంటిది.  ఇప్పుడా అవకాశం కీర్తికి దక్కింది. ర‌జనీకాంత్ 168వ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వ్య‌క్తం చేసింది. ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ అభిమానిగా ఉన్న నేను ఇప్పుడు ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం పొందాను. ఇది నా జీవితంలో ఎప్ప‌టికి గుర్తు ఉంటుంది. ఈ విషయంపై మొన్నటి వరకు అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.

 

తాజాగా  చిత్ర యూనిట్‌తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.  ఈ సందర్భంగా తన ఆనందాన్ని షేర్ చేసుకుంటి కీర్తి సురేష్.  ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది.. రజినీ సార్‌ని కలవడమే పెద్ద విషయం... కానీ, అయనతో కలిసి నటించడం నా జీవితంలో మరిచిపోలేనంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది కీర్తి.  శివ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ 168వ మూవీ తెర‌కెక్క‌నుండ‌గా, స‌న్ పిక్చ‌ర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: