ప్రతి సంక్రాంతికి టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. అయితే రాబోతున్న సంక్రాంతికి జరగబోతున్న బన్నీ మహేష్వార్ వారిద్దరి ఇగో వార్ గా మారడంతో జరుగుతున్న పరిణామాలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. సాధారణంగా టాప్ హీరోల అభిమానులు వేరే హీరోల సినిమాల పై నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటారు. 

ఇప్పుడు అల్లు అర్జున్ పిఆర్ టీమ్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పై నెగిటివ్ ప్రచారం చేస్తోంది అంటూ వస్తున్న కొన్ని గాసిప్పులు మహేష్ దృష్టి వరకు రావడంతో మహేష్ తీవ్ర అసహనానికి గురి అవుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సంక్రాంతి రేస్ పబ్లిసిటీని అల్లు అర్జున్ ‘సామజవరగమన’ పాట వీడియో రిలీజ్ తో మొదలు పెట్టారు ఆ పాట అందరికీ బాగా నచ్చిన విషయం తెలిసిందే. 

ఆ పాటగురించి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ మహేష్ పి.ఆర్.టీమ్ చేయకుండా చాల హుందాగా వ్యవహరించారు అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఆతరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ పాటలు విడుదల అవ్వడం కొనసాగుతూ ఉంది. ఈ పాటలను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ పి ఆర్ టీమ్ బన్నీ అభిమానుల పేర్లతో సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక షాకింగ్ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉంది. 

ఈ విషయాలు మహేష్ దృష్టి వరకు రావడంతో తన పై తన సినిమా పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టడం లేదు అని మహేష్ తన పి ఆర్ టీమ్ ను ప్రశ్నించడమే కాకుండా రేపు విడుదల కాబోతున్న ‘అల వైకుంఠపురములో’ టీజర్ విషయంలో బన్నీ పి ఆర్ టీమ్ అనుసరిస్తున్న స్ట్రాటజీని అనుసరించి ఒక గట్టి రిప్లయ్ ఇవ్వవలసిందిగా మహేష్ తన పి ఆర్ టీమ్ కు సూచనలు ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో నిజాలు ఎన్నో తెలియకపోయినా బన్నీ మహేష్ ల సినిమాల వార్ వారిద్దరి మధ్య గ్యాప్ ను పెంచుతుంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: