ఎన్నో అంచనాల మధ్య ఒక సూపర్ హిట్  హీరో... బంపర్ హిట్ దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమా అంటే ఫుల్ టైమ్  ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ..అటు  మహేష్ బాబు సినిమా అన్న ప్రేక్షకుల్లో అదో సపరేట్ క్రేజ్. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రాబోతుందా అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా  సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మేజర్ అజయ్ కృష్ణగా  నటించబోతున్నాడు. కాగా మహేష్ బాబు సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న నటిస్తోంది. 

 


 అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాలో దాదాపు పదమూడేళ్ళ తరవాత టాలీవుడ్ అమితాబ్ విజయశాంతి కూడా నటించటం...  ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. కాగా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక అటు  ప్రతివారం అభిమానుల కోసం ఈ సినిమాకు సంబంధించి సరికొత్త అప్డేట్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ లిరికల్ వీడియో విడుదల చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ ను  షేక్ చేస్తోంది. 

 

తాజాగా మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాను  గురించి రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను కీలకమైన పాత్రను పోషిస్తున్నానని... ఇంతవరకు తాను చేసిన పాత్రలు అన్నింటికీ సరిలేరు నీకెవ్వరు లో చేసిన పాత్ర భిన్నంగా ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశానని ఆయన అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో ప్రతి పాత్రను  చాలా చక్కగా తీర్చిదిద్దాడని... దర్శకుడిగా ఆయన ప్రత్యేకత ఏమిటో తనకు అర్థమైందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అజయ్ కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా కొత్తగా కనిపిస్తారు అని... ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుంది అనే నమ్మకం తనకు ఉందని రాజేంద్రప్రసాద్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: