ఆ మద్య ఫిలిమ్ ఛాంబర్ ముందు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి పెద్ద దుమారమే రేపింది.  సినిమాల్లో నటించడానికి వస్తున్న ఎంతో మంది యువతులను కొంత మంది ఇండస్ట్రీ చిన్నా పెద్ద కలిసి ట్రాప్ చేసి వారిని దారుణంగా అనుభవిస్తున్నారని.. పడక సుఖం ఇస్తేనే సినిమా ఛాన్సులంటూ అమ్మాయిలతో విచ్చలవిడి శృంగారం చేస్తున్నారని ఆరోపించింది.  అవసరం తీరాక వారి ముఖం కూడా చూడటం లేదని.. తాము మోసపోయామని తెలిసిన అమ్మాయిలు వ్యభిచారులుగా మారుతున్నారు..కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసింది.  తాను కూడా కొంతమంది చేతిలో మోసపోయానని చెప్పి ఇలాంటివి ఇక జరగకూడదని పెద్ద పోరాటమే చేసింది.

 

ఇదే సందర్భంలో మా అసోసియేషన్ వారు తనకు మెంబర్ షిప్ కార్డు ఇవ్వడం లేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది.  ఈ వ్యవహారం జాతీయ మీడియా ఛానల్స్ లో రావడంతో పెద్ద సెన్సేషన్ అయ్యింది. తాజాగా ఇప్పుడు ఓ హీరో తనకు అన్యాయం జరిగిందని.. తనకు న్యాయం చేకుంటే ఫిలిమ్ ఛాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తెలుగు ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే..  దురగాప్రసాద్ అనే ఔత్సాహిక నటుడు ‘నానిగాడు’ అనే సినిమా తెరకెక్కించారు. ఆయనే హీరోగా నటిస్తూ నిర్మించిన ఆ సినిమాని సీపీ రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించాడు. 40 లక్షల ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

 

ఈ మూవీకి ఈ మధ్యనే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమాని ఎవరో యూట్యూబ్ లో లీక్ చేశారు.  దాంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళనకు దిగింది సినిమా యూనిట్. యూట్యూబ్ లింక్ ను వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని చిత్ర యూనిట్ కోరుతోంది.  ప్రస్తుతం తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. అయినా కూడా తొలగించకుంటే రేపు చిత్ర యూనిట్ తో ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హీరో దుర్గాప్రసాద్ హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎంత వరకు నిజం అన్న విషయం మాత్రం తెలియరాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: