ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే కదా. ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ ను విశాఖ జిల్లా అరకులోని మోడ కొండమ్మ ప్రాంతంలో చిత్రీకరణ చేయడానికి మొదలుపెట్టారు. ఇందుకోసం హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్ మంగళవారం విశాఖకు చేరుకోవడం జరిగింది. ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి బయలదేరి విశాఖకు వచ్చిన ఎన్టీఆర్ కు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది.  

 

ఇక ఈ సినిమాలో అల్లూరిగా రాంచరణ్ నటిస్తుంటే కొమరం భీం గా తారక్ నటిస్తున్నాడు అని తెలిసిందే కదా. విశాఖ ఏజెన్సీలోని మోదాపల్లి, డల్లాపల్లి మండలాల్లో కాఫీ తోటల్లో ఈ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాము అని చిత్ర యూనిట్ తెలియచేయడం జరిగింది. ఇక మరో  వైపు భారీ కాస్టింగ్‌కు తోడు, కథపై కూడా కొంత క్లారిటీ రావడంతో ఈ సినిమాపై  బాగా అంచనాలు పెరిగాయి అభిమానులలో.  నేటి నుంచి ఆరు రోజుల పాటు సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరగబోతుంది అని చిత్ర యూనిట్ తెలిపారు.

 

 

ఎన్టీఆర్ సినిమా షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని తెలిసి నందమూరి అభిమానులు చాల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం షూటింగ్ ప్రాంతంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. సినిమాలో కనిపించనున్న గుర్రాన్ని కూడా ఇప్పటికే ఇక్కడకు చిత్ర యూనిట్ తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ విశాఖ చేరుకున్న వీడియోలు, ఫోటోలు   బాగా వైరల్ గా మారాయి అంటే నమ్మండి. ఈ సినిమా .. వచ్చే సంవత్సరం జులైలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: