ఒక్కోసారి సినిమా రంగంలో ఎదురయ్యే పరిస్దితులు చాలా విచిత్రంగా ఉంటాయి. అదెలాగంటే ఎవరైన పెద్ద హీరోల సినిమాలు ఒకే వారంలో గాని, ఒకరోజులో గాని పోటీపడి రిలీజ్ చేస్తే దీనివల్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఆ సినిమా సరిగ్గా ఆడకుంటే వచ్చే నష్టం భారీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే జరుగబోతుందంటున్నారు సినీవర్గాలవారు. ఇకపోతే అల్లు అర్జున్‌ అల వైంకుఠపురంలో సినిమాతో పాటుగా మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా సంక్రాంతి కానుకగా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

 

 

ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో పాటు హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో నిర్మాణం జరిగింది. ఇదంతా  బాగానే ఉంది కాని ఈ సినిమాలు రెండు కనీసం రెండు మూడు రోజుల గ్యాప్‌లో అయినా విడుదల అవుతే మంచిదను కుంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఒకే రోజున రెండు సినిమాలు విడుదల అవ్వడం వల్ల ఈ రెండు చిత్రాలకు నష్టం జరుగవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

 

 

ఎందుకంటే సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాను చూడాలని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కాని అదే రోజున అల వైకుంఠపురంలో సినిమాను కూడా విడుదల చేయడం వల్ల కొందరు అటు మరికొందరు ఇటు అన్నట్లుగా కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.. అయితే నిర్మాతలు ఈ రెండు సినిమాల మద్య గ్యాప్‌ ఉంచాలని భావించారు. కాని ఇద్దరు హీరోలు కూడా ఈగోలకు వెళ్లి సినిమా తేదీని మార్చేది లేదు అంటూ చెబుతున్నారట.

 

 

ఇద్దరు కూడా వెనక్కు తగ్గక పోవడంతో నిర్మాతలు బలి అయ్యే పరిస్థితి వచ్చింది. నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే బయ్యర్లు కూడా రెండు సినిమాలు ఒకే సారి అవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏం చేస్తారో సంక్రాంతి వరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: