ఎప్పుడో రెండేళ్ళ క్రితం... మెగా బ్రదర్స్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టి స్టారర్ సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుబ్బిరామిరెడ్డి కీలక ప్రకటన చేసారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నిర్మాతగా ఈ సినిమాను తీసుకోస్తున్నాను అన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా విషయంలో ఒక్క ముందు అడుగు కూడా పడలేదు. 

 

గత ఏడాది ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమా విషయంలో చర్చలు జరుగుతున్నాయి అని, త్వరలో షూటింగ్ కి కూడా వెళ్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమా ముందుకి మాత్రం వెళ్ళలేదు. అసలు దీనికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియలేదు. ఒకవైపు అభిమానులు సిని విశ్లేషకులు ఈ సినిమా ముందుకి వెళ్తుందని, భారీ విజయం సాధిస్తుందని, త్రివిక్రమ్ కథ ను సిద్దం చేసే పనిలో ఉన్నారు అనే ప్రచారం ఎక్కువగా చేశారు.

 

కానీ అధికారిక ప్రకటన మాత్రం ఈ సినిమా విషయంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా బయటకు రాలేదు. తాజాగా దీనిపై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా విషయంలో చిరంజీవి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. రీఎంట్రీ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా ఆకట్టుకోలేదు. దీనితో ఈ సినిమా కూడా ప్రయోగం కావడం, కథ కూడా అంత ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో చిరంజీవి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. 

 

సుబ్బిరామి రెడ్డి తో కూడా ఇదే విషయాన్ని చిరంజీవి చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఇక పవన్ కూడా సినిమాల్లో ఉంటారో లేదో తెలియని పరిస్థితి... ఇవన్ని కూడా చిరంజీవిని వెనక్కు లాగాయని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: