మహేష్ బాబు హీరోగా సెన్సేషనల్ యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ లతోపాటు చాలా కాలం తర్వాత విజయశాంతి స్క్రీన్ ముందు కనపడనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు విడుదల కాగా వాటిలో ఒకటి పర్వాలేదనిపించగా ఇంకొక పాట సూపర్ హిట్ అయ్యింది. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో లో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ మరియు పొలిటికల్ డ్రామా రెండూ కలగలిపి అనిల్ రావిపూడి అద్భుతంగా తెరకెక్కించాడని అంటున్నారు.

 

అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన జోడీ కట్టిన రష్మిక మందన ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రోలో మరియు పాటలలో ఎక్కడా కనిపించలేదు. పెద్ద సినిమాలలో హీరోయిన్ కి ఉండే ప్రాధాన్యత తక్కువే అయినా సరిగ్గా ఆమె పాత్రను పరిచయం చేయకపోవడం ఏమిటి అని మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగా కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏమిటంటే సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్నా కూడా ఉందట. అయితే తమన్నా ఇప్పటికే చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలో కూడా బాబు సరసన స్టెప్పులు వేయనుందని సమాచారం.

 

కొంతమంది చెప్పిన దాని ప్రకారం సినిమాలో తమన్నా కు కూడా ఒక కీలక పాత్రను ఇచ్చారని... ప్రేక్షకుల ముందుకి ఒక సర్ప్రైజ్ లాగా తనను తీసుకుని వచ్చే యోచనలో చిత్రబృందం ఉందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే ఈ సినిమాలో తాను ఉన్నానని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్న రష్మిక తన పాత్రను తమన్నా కనుక డామినేట్ చేస్తే ఇక తను ఈ సినిమాలో హీరోయిన్ గా చేశానని... మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన నటించాను అని చెప్పుకోవడానికి కూడా ఏమి మిగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: