ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ల మధ్య సత్సంబంధాలు గతాన్ని కంటే భిన్నంగా ఉన్నాయి. ఒకరి సినిమా కార్యక్రమాలకు మరొకరు వెళుతూ ఇండస్ట్రీలో మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి ఎవరికివారు తమ వంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తమ తమ అభిమాన హీరోల కోసం చాలామంది అభిమానులు బయట సమాజంలో ఒకరిపై ఒకరు వివాదాలు చేసుకుంటూ కొట్లాడుకునే సందర్భాలు ఎక్కువ అవుతున్న క్రమంలో  ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరికి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఒకరి సినిమా కార్యక్రమాలకు మరొకరు వెళుతూ తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని తెలియజేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అలా వైకుంఠపురం లో’ సినిమా కోసం కూడా జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా తీసుకురావటానికి అల్లు అర్జున్ అదిరిపోయే స్ట్రాటజీ వేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్ళటానికి అంగీకరించినట్లు సమాచారం.

 

ముఖ్యంగా ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత చాలా టైమ్ తీసుకుని ఎలాగైనా గ్యారెంటీగా హిట్ కొట్టాలని ‘అలా వైకుంఠపురం లో’ సినిమా ఓకే చేయడం జరిగింది. దీంతో ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని అల్లు అర్జున్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావటం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘అల వైకుంఠ పురంబులో’ సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: