స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ  అల... వైకుంఠపురములో   షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన  సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని  సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఇప్పుడు అందరి  చూపు  టీజర్  పై పడింది.  రేపు ఈటీజర్ సాయంత్రం 4:05 గంటలకు  విడుదలకానుంది.  ఇక ఈ చిత్రం యొక్క బిజినెస్ కూడా  పూర్తైయింది.  ప్రపంచ వ్యాప్తంగా  ఈసినిమా థియేట్రికల్ హక్కులు  84కోట్లకు  అమ్ముడైయ్యాయని సమాచారం.
 
 
కాగా ఇంతకుముందే  నాన్ థియేట్రికల్  హక్కులు కూడా అమ్ముడుపోయాయి. అందులో భాగంగా   ఈసినిమా శాటిలైట్ హక్కులను  జెమినీ టీవి సొంతం చేసుకోగా  డిజిటల్ హక్కులను  సన్ నెక్స్ట్  దక్కించుకుంది. ఆడియో రైట్స్  ను  ఆదిత్య  మ్యూజిక్ చేజిక్కించుకుంది. వీటన్నింటి డీల్ విలువ 20కోట్ల  పైనే ఉంటుంది. అలా ఈ చిత్రం  100కోట్లకు  పైగా  బిజినెస్ చేసి విడుదలకు ముందే  నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.
 
 
త్రివిక్రమ్ డైరెక్షన్  లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో  బన్ని కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుండగా టబు, జయరాం , మురళీ శర్మ , సునీల్ ,నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజు  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత బన్ని , సుకుమార్ డైరెక్షన్ లో   నటించనున్నాడు.  వచ్చే వారం లో ఈ చిత్రం  సెట్స్  మీదకు వెళ్లనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: