ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి నిన్న ఎన్టీఆర్, కొమరం భీం లుక్ లో ఉన్న ఫోటో మరియు ఒక వీడియో సోషల్ మీడియా లో లీక్ కావడంతో ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. సినిమా యూనిట్ బృందంలోని కొందరు తమ సెల్ ఫోన్ కెమెరాతో తీసిన ఆ పిక్స్ వలన సినిమాకు కొంత మేర డ్యామేజీ జరిగిందని భావించిన సినిమా యూనిట్, ఇకపై షూటింగ్ లొకేషన్లోకి సెల్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని నిర్ణయించారట. 

 

నిజానికి లీకేజీల పై దర్శకుడు రాజమౌళి సహా హీరోలిద్దరూ కూడా కొంత అసహనం వ్యక్తం చేసారని, తాము ఒకవైపు కోట్లు ఖర్చుపెట్టి ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందించాలని ఎంతో శ్రమించి సినిమాలు తీస్తుంటే, ఈ విధంగా చిన్న సెల్ ఫోన్ తో మేము పడుతున్న శ్రమను దోచుకోవడం సబబు కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టాక్. అయితే ఇది కేవలం ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రమే కలిగిన ఇబ్బంది కాదని, కొన్ని ఇతర సినిమాల విషయంలో కూడా ఇటీవల ఇటువంటి లీక్స్ బయటపడుతున్నాయని, కావున ఇకపైన మిగతా సినిమాల యూనిట్ సభ్యులు కూడా ఈ విధంగా కఠినంగా వ్యవహరించాలని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: