యంగ్‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. ఇక బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా టాలీవుడ్ లో స‌క్స‌స్ కాక‌పోయినా బాలీవుడ్ లో మాత్రం సక్స‌స్ అవ్వ‌డంతో ప్ర‌భాస్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్ర‌కారం ప్రభాస్ క్రేజ్ మ‌రింత‌ రెట్టింపు చేసే బాధ్యతలను డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు భుజాన వేసుకున్నారట. ఎన్నో భారీ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ డైరెక్టర్‌గా పేరొందిన శంకర్.. ప్రభాస్ తో తన తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.

 

ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా నిర్మాణంలో శంకర్ బిజీగా ఉన్నాడు.  భార‌తీయుడు 2 సినిమాని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు కానీ.. కానీ లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ప్ర‌భాస్, శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందే భారీ బ‌డ్జెట్ మూవీని  దిల్ రాజు నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ శంక‌ర్, ప్ర‌భాస్ కి క‌థ చెప్పార‌ట‌. దీనికి ప్ర‌భాస్ కూడా సానుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే మ‌రో విష‌యం ఏంటంటే.. బాహుబలి రెండు భాగాలకు కలిపి సుమారు రూ.2500 కోట్ల వసూళ్లు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల అంచనా ఉంది. మ‌రి దీన్ని దృష్టిలో ఉంచుకొని శంక‌ర్ కనీసం రూ.1000 కోట్ల బడ్జెట్ తో  సినిమా తీయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

 

కాగా, కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న `భార‌తీయుడు 2` సినిమా పూర్తికాగానే ప్రభాస్ సినిమా పనుల్లో పడనున్నారట శంకర్. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కూడా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జాన్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ జనవరి నెల నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఈ సినిమాను పూర్తి చేసే ప‌నుల్లో ఉన్నారు. మ‌రోవైపు రజనీకాంత్, కమల్ ,విక్రమ్ వంటి వారితో సూపర్ హిట్స్ ఇచ్చిన శంక‌ర్‌ ప్రభాస్ తో సినిమా అంటే ఖచ్చిచతంగా మాసివ్ యాక్షన్ సినిమా ఉంటుందనేది నిజం. ఏదైమ‌న ప్ర‌భాస్‌- శంక‌ర్- దిల్ రాజ్ ఈ క్రేజీ కాంబినేష‌న్‌ ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: