‘అల వైకుంఠపురములో’ మూవీతో మహేష్ పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ కు తన మూవీ ఇంకా విడుదల కాకుండానే ఊహించని షాక్ తగిలింది. మహేష్ కు 2019 సంవత్సరానికి సంబంధించి ఒక సముచిత గౌరవం లభించింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ కావడంతో మహేష్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. 

2019 సంవత్సరానికి గాను భారత దేశంలో టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ మేల్ లిస్టును ప్రకటించింది ట్విట్టర్. ఈ లిస్టులో తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు ఒక్కడే స్థానం దక్కించుకున్నాడు. #ThisHappened2019 హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ వదిలిన ఈ టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ మేల్ లిస్టులో మొదటి స్థానంలో అమితాబ్ బచ్చన్ నిలిచారు. రెండో స్థానంలో అక్షయ్ కుమార్ మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ ఆ పై వరుసగా షారుక్ ఖాన్ తమిళ యాక్టర్ విజయ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దక్కించుకున్నారు. 

ఈ లిస్టులో మహేష్ బాబుకు 9వ స్థానం దక్కింది. ఇప్పుడు ఈ వార్తను ఆధారంగా తీసుకుని మహేష్ అభిమానులు రెచ్చిపోతు బన్నీ అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కాకుండానే మహేష్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసేలా ట్విటర్ రేటింగ్స్ ఉన్నాయని అంటూ ఇన్ డైరెక్ట్ గా బన్నీ అభిమానులను రెచ్చ గొడుతున్నారు. 

మహేష్ కు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడంతో ఇప్పుడు మహేష్ కూడ ఇతర టాప్ హీరోలులా ఒక పాన్ ఇండియా మూవీలో నటిస్తే బాగుంటుంది అంటూ మహేష్ అభిమానులు వేల సంఖ్యలో మహేష్ కు సూచనలు పెడుతున్నట్లు టాక్. అయితే మహేష్ దృష్టి మాత్రం ఎప్పుడు బాలీవుడ్ మూవీల పై లేకపోవడంతో అతడికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా మహేష్ అభిప్రాయాలు ఇప్పట్లో మారే ఆస్కారం కనిపించడం లేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: