రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘వెంకీ మామ’ మూవీని చాల వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు. దీనితో ఎక్కడ చూసినా ఈ మూవీ మ్యానియా కనిపిస్తోంది. నిర్మాత సురేశ్ బాబు ‘వెంకీ మామ’ కు అత్యంత భారీ ఓపెనింగ్స్ రప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు అన్వేషిస్తూ ఈ మూవీకి అత్యంత భారీ పబ్లిసిటీ చేస్తున్నారు.  

టోటల్ దగ్గుబాటి కుటుంబం రంగంలోకి దిగి ఈ మూవీ విశేషాలను చెపుతూ ఒక ఇంటర్వ్యూ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఇప్పటికే రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రానా యాంకర్ గా వ్యవహరిస్తే సురేశ్ బాబు వెంకటేష్ నాగచైతన్యలతో పాటు ఈ మూవీ హీరోయిన్స్ కూడ ఈఇంటర్వ్యూ కార్యక్రమంలో కనిపించ బోతున్నారు. 

వాస్తవానికి ఫిలిం ఇండస్ట్రీలో ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత ఒక రియల్ హిట్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ వర్గాలు చూడలేదు. దీనితో ధియేటర్స్ అన్నీ కలక్షన్స్ లేక బోసిపోతున్నాయి. ఇప్పుడు ఆ లోటును ‘వెంకీ మామ’ తీరుస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా ఈ మూవీకి సంబంధించి ప్రచారంలోకి వచ్చిన ఒక ఇన్ సైడ్ టాక్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాల సరదాగా జరిగిపోయినా సెకండ్ హాఫ్ లో చాల భారీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎమోషనల్ సీన్స్ ఓవర్ డోస్ పెరగడంతో తమిళ సినిమాలలోని భారీ ఎమోషనల్ సీన్స్ ఈ మూవీని చూస్తున్న ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారి భారీ ఎమోషనల్ సీన్స్ ను చూడటానికి ఇష్టపడని పరిస్థితులలో ఈ మూవీ పై ప్రేక్షకులు ఇచ్చే తీర్పు బట్టి ఈ మూవీ ఘన విజయం ఆధారపడి ఉంటుంది అన్న అభిప్రాయం ఇన్ సైడ్ టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: