సంక్రాంతికి సినిమాల పోటీ ప్రారంభమైంది. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన "అల వైకుంఠపురములో" మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ పోటీ ఇప్పటి నుండే ప్రారంభమైంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ జోరు మీదున్నాయి. ఒకదానికి మించి మరోటి ప్రమోషన్స్ లో ముందడుగు వేస్తున్నారు. అయితే ప్రమోషన్ల విషయంలో కాస్త తెలివిగా ప్రవర్తిస్తుంది మాత్రం "అల వైకుంఠపురములో "టీమ్ అని చెప్పాల్సిందే.

 

ఎందుకంటే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు టీమ్ నుండి అసలెలాంటి అప్డేట్ రాక ముందే అల వైకుంఠపురములో నుండి రిలిజైన సామజవరగమనా పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఆ ఒక్క పాట సినిమాకి తెచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అయితే బన్నీ సినిమా నుండి పాటలు విడుదల అవుతుంటే మహేష్ ఒకేసారి టీజర్ రిలీజ్ చేసి అమాంతం అంచనాలని పెంచేశాడు.

 

అయితే ఈ పోటీలో అల వైకుంఠపురములో మరో అడుగు ముందుకేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ని కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఈ వెంట్ కి బన్నీ కోసం తారక్ వస్తున్నాడట. ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో ఓకే చేసాడు కనుక దీనికోసం అతను రావడం దాదాపు ఖరారైనట్టే. మరి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకి గెస్ట్ గా ఎవరు వస్తారనేది ఆసక్తిగా మారింది. గతంలో మహేష్‌ 'భరత్‌ అనే నేను' చిత్రం వేడుకకి తారక్‌ని ఆహ్వానించినట్టుగా ఈసారి కూడా ఎవరైనా స్టార్‌ హీరోని ఇన్వయిట్‌ చేస్తారా అనేది తెలియాలి.

 

మరి ఈ పోటీ ఎక్కడిదాకా సాగుతుందో చూడాలి. ఈ సంక్రాంతికి మాత్రం థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: